నేడు తొలి రాష్ట్రపతి జయంతి

నేడు తొలి రాష్ట్రపతి జయంతి

నేడే తొలి రాష్ట్రపతి జయంతి
కవి,లెక్చరర్ శేషారావు వైద్య


అధికారమంటే సేవ చేయడమే   కానీ ఆధిపత్యం ప్రదర్శించడం కాదుభారతతొలిరాష్ట్రపతిరాజ్యాం గ పరిషత్ అధ్యక్షుడు అయిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జన్మదినం. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఆయన పేరు స్వచ్ఛత, సేవాభావం వినయా నికి ప్రాతికగా నిలు స్తుంది. 1884లో బీహార్ లో జన్మించి న రాజేంద్రప్రసాద్ విద్యావంతుడు,న్యాయవాది,ఆలోచనపరుడు.కలకత్తావిశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలోఉన్న త విద్యను పూర్తి చేసి న్యాయ వాద వృత్తి ని ప్రారంభించారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ నుంచి పిలుపు అందు కున్న క్షణం నుండి ఆయన జీవిత దశ మారిపోయింది. చంపార న్సత్యాగ్రహం,సహాయనిరాకర ణ ఉద్యమం ఉప్పు సత్యాగ్ర హం వంటి ఉద్యమా ల్లో పాల్గొని విశిష్ట సేవలు అం దించారు. భారత రాజ్యాంగం రూపొందించుకున్న తర్వాత 1950 సంవత్సరంలో దేశపు తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యా రు. పదవిలోఉన్నప్పటికిగాందే య విలువలను ఆచరణలో కొనసాగించారు. సరళ జీవనం పారదర్శక వైఖరి దేశ సేవ పట్ల అంకితభావంఆయనవ్యక్తిత్వా నికి మూల సూత్రాలు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా సేవ లు అందించి ప్రజల మన్ననల ను పొందిన అరుదైన నాయ కుడు. 1954లో ఆయనకు భారతదేశ అత్యున్నత గౌరవం భారతరత్న ప్రధానం చేయ బడింది.ఆయన చూపిన నిజా యితీ,నిస్వార్థ సేవ మార్గం నేటి ప్రజా ప్రతినిధులకు మార్గ దర్శకంగా నిలుస్తుంది.రాజేంద్ర ప్రసాద్ గారి జీవితం మన నేర్పే విషయం ఒకటి"అధికారమంటే సేవ చేయడమే",  ఆధిపత్యం ప్రదర్శించడం కాదు. ఈ దేశం ఆయన చేసినసేవలకుఎల్లప్పు డూ రుణపడిఉంటుంది.ఘనం గా నివాళులు కూడా ఇస్తుంది.

0/Post a Comment/Comments